క్రీడా పురస్కారాల కార్యక్రమానికి పుజారా దూరం

29 Aug, 2017 10:49 IST|Sakshi
క్రీడా పురస్కారాల కార్యక్రమానికి పుజారా దూరం

న్యూఢిల్లీ: ‘అర్జున’ అవార్డు పొందిన భారత స్టార్‌ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా... న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేడు(మంగళవారం) జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనడంలేదు. ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్‌ పోటీల్లో ఆడుతున్నందున తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని పుజారా తెలిపాడు.

 

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), జ్యోతి సురేఖ (ఆర్చరీ) ‘అర్జున’ అవార్డులను... గంగుల ప్రసాద్‌ (బ్యాడ్మింటన్‌) ‘ద్రోణాచార్య’ అవార్డును, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ (ఫుట్‌బాల్‌) ‘ధ్యాన్‌చంద్‌’ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా స్వీకరించనున్నారు.   

 

మరిన్ని వార్తలు