‘మరో ఐదు నెలల్లో అంతా అమలు’

5 Mar, 2017 10:42 IST|Sakshi
‘మరో ఐదు నెలల్లో అంతా అమలు’

న్యూఢిల్లీ: బీసీసీఐలో లోధా ప్యానెల్‌ సూచించిన నూతన సంస్కరణలు మరో నాలుగైదు నెలల్లో పూర్తిగా అమలవుతాయని పరిపాలక కమిటీ (సీఓఏ) పేర్కొంది. ‘కోర్టు సూచించినట్టుగా బోర్డు పూర్తి ప్రక్షాళన వీలైనంత త్వరగా చేసేలా ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా నూతన నిర్మాణం, ఆర్థిక విధానం, పరిపాలన పారదర్శకంగా ఉండేలా వ్యవస్థను రూపొందిస్తాం. ఇదంతా సుదీర్ఘంగా కాకుండా వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లోనే పూర్తవుతుంది’ అని నలుగురి సభ్యులతో కూడిన సీఓఏకు నేతృత్వం వహిస్తున్న వినోద్‌ రాయ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో క్రికెట్‌ జరిగేందుకు ఎలాంటి అడ్డంకి లేదని చెప్పారు.

 

మరిన్ని వార్తలు