న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తమదే నిర్ణయాధికారమని నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఐసీసీ సమావేశాల్లో పాల్గొనే బీసీసీఐ ప్రతినిధిని ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది.
ఈ నెల 9న ప్రత్యేక బోర్డు సమావేశం నేపథ్యంలో రాష్ట్ర సంఘాలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. శ్రీనివాసన్ను బోర్డు ప్రతినిధిగా పంపాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఈ వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.