మౌంట్ మాంగానూ: శ్రీలంకతో హోరాహోరీగా సాగిన తొలి టి20లో న్యూజిలాండ్ మూడు పరుగులతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 182 పరుగులు చేసింది. గప్టిల్ (34 బంతుల్లో 58; 4 ఫోర్లు; 4 సిక్సర్లు), విలియమ్సన్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడింది. గుణతిలక (46), సిరివర్ధన (42), పెరీరా (28) పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బౌల్ట్ (3/21)తో పాటు హెన్రీ మూడు వికెట్లు తీశాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో తర్వాతి టి20 ఆదివారం జరుగుతుంది.