కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'

26 Jul, 2014 17:43 IST|Sakshi
కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటర్ల హవా కొనసాగుతోంది. షూటింగ్లో భారత్కు మరో పతకం దక్కింది. శనివారం జరిగిన పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించాడు.

ప్రకాశ్ 198.2 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో డానియల్ రెపచొలి 199.5 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి పసిడి దక్కించుకున్నాడు. కాగా ఇదే విభాగంలో మరో భారత షూటర్ ఓం ప్రకాశ్ పాల్గొన్న ఫైనల్స్కు ముందే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు