ఆసియా బాక్సింగ్ టోర్నీలో ఆరు పతకాలు ఖాయం

11 Aug, 2015 00:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించారు.
 
 

మరిన్ని వార్తలు