‘సాక్షి’ కథనానికి స్పందన
ల్యాప్టాప్ అందించిన అన్నాచెల్లెళ్లు
కాకినాడ: చదరంగంలో నిలకడగా రాణిస్తున్న యువ క్రీడాకారుడు షణ్ముఖ తేజకు సహకారం అందించమంటూ... గతనెల 25న ‘తేజస్సుకు చేయూత కావాలి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కాకినాడకు చెందిన అన్నాచెల్లెళ్లు స్పందించారు. ఆన్లైన్ శిక్షణ పొందేందుకు వీలుగా షణ్ముఖకు ల్యాప్టాప్ అందించేందుకు వీరు ముందుకు వచ్చారు.
బుధవారం ఇక్కడ తమ ఇంట్లో జరిగిన కార్యక్రమంలో తేజకు అన్నాచెలెళ్లు నారాయణరావు, సీత ల్యాప్టాప్ను బహుకరించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న తాము కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో తేజకు అండగా నిలవాలని నిర్ణరుుంచుకున్నట్లు వారు ‘సాక్షి’కి చెప్పారు. షణ్మఖ తేజ ఇటీవలే ధర్మవరంలో జరిగిన ‘ఫిడే’ అండర్-1600 రేటింగ్ టోర్నీలో విజేతగా నిలిచాడు.