దక్షిణాఫ్రికా టూర్‌ను బహిష్కరించిన ఆసీస్‌ ‘ఎ’

7 Jul, 2017 00:46 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆ దేశ ఆటగాళ్లకు కొనసాగుతున్న జీతభత్యాల వివాదం మరింతగా ముదిరింది. సీఏ, ఆటగాళ్ల సంఘం (ఏసీఏ) మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం కానరాలేదు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు దూరంగా ఉండనుందని ఏసీఏ ప్రకటించింది. అనధికారిక టెస్టులు, ముక్కోణపు వన్డే టోర్నీలో పాల్గొనేందుకు ఆసీస్‌ ‘ఎ’ జట్టు ఈనెల 12న సఫారీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఉస్మాన్‌ ఖాజా కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో మ్యాక్స్‌వెల్, బర్డ్‌లాంటి సీనియర్‌ టీమ్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్, భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు సీనియర్‌ జట్టు వెళ్లేది కూడా అనుమానంగానే మారింది.
 

మరిన్ని వార్తలు