మెరిసిన మిలింద్

1 Aug, 2013 01:37 IST|Sakshi

అరుణెగల: శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో ‘యూత్ టెస్టు’లో భారత్ అండర్-19 టీమ్ ఆధిక్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మూడో రోజు బుధవారం ఆట ముగిసే సరికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ (82 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), సమర విక్రమ (122 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.
 
 వీరిద్దరు నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్ సీవీ మిలింద్ 43 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. వరుసగా రెండు ఓవర్లలో మెండిస్, సుమనసిరి (4)లను అవుట్ చేసి మిలింద్ లంకను దెబ్బ తీశాడు. జైస్వాల్, ఘనిలకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడిన లంక ప్రస్తుతం చేతిలో ఐదు వికెట్లతో 64 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. ఆటకు గురువారం చివరి రోజు.
 

మరిన్ని వార్తలు