నిలకడగా దాల్మియా ఆరోగ్యం

19 Sep, 2015 02:18 IST|Sakshi
నిలకడగా దాల్మియా ఆరోగ్యం

కోల్‌కతా : బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా గురువారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు కోల్‌కతాలోని బిర్లా ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 75 ఏళ్ల దాల్మియా ఈ ఏడాది మార్చిలో మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి అనారోగ్యంగానే ఉన్నారు. గత జూన్‌లోనే ఐపీఎల్ వివాదంపై కమిటీ విచారణకు అనారోగ్యం కారణంగా దాల్మియా సరిగా సహకరించకపోవడంతో అసలు బీసీసీఐని ఎవరు నడిపిస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

>
మరిన్ని వార్తలు