చైనాతో డేవిస్‌ కప్‌ పోరుకు భారత్‌ సై

6 Apr, 2018 00:52 IST|Sakshi

ఉ.గం.7.30 నుంచి నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 

తియాన్‌జెన్‌ (చైనా): ఆసియా ఓసియానియా గ్రూప్‌–1లో భాగంగా భారత్, చైనా జట్ల మధ్య డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ నేడు మొదలవుతుంది. తొలి రోజు సింగిల్స్‌ విభాగంలో వీ బింగ్‌తో రామ్‌కుమార్‌; జీ జాంగ్‌తో సుమిత్‌ ఆడతారు. రెండో రోజు శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో పేస్‌–బోపన్న జంట డి వూ–మావొ జిన్‌ గాంగ్‌ జోడీతో ఆడనుంది.

డబుల్స్‌ మ్యాచ్‌ తర్వాత రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్‌ విభాగం లో డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కడానికి భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు