బెల్గ్రేడ్: డేవిస్ కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా భారత్, సెర్బియా జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. సెర్బియా తరఫున యూఎస్ ఓపెన్ తాజా చాంపియన్ నొవాక్ జొకోవిచ్ బరిలోకి దిగడంలేదు. భారత్ తరఫున సింగిల్స్లో రామ్కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సాకేత్ మైనేని... డబుల్స్లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ బరిలోకి దిగనున్నారు.