తొలి వికెట్ కోల్పోయిన భారత్: విజయ లక్ష్యం 364

13 Dec, 2014 06:21 IST|Sakshi

అడిలైడ్: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఐదవ రోజు 364 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్ను ఆరంభించింది.  ఆదిలోనే తొలి వికెట్ను కోల్పోయింది. భారత్ ఓపెనర్గా ధావన్ 4.1 ఓవర్లలో( 8 బంతుల్లో 1ఫోరు) 9 పరుగులతో జాన్సన్ బౌలింగ్లో హద్దీన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ధావన్ సింగల్ డిజిట్కే పరిమతమైయ్యాడు. ప్రస్తుతం మురళీ విజయ్ (9), పుజారా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, నాలుగో రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ 444 పరుగుల వద్ద ఆలౌటైంది.

>
మరిన్ని వార్తలు