మ్యాచ్ గెలుస్తామనే హామి ఇస్తున్నాను
ముంబై : ఈ రోజు ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో తమ జట్టు పక్కా విజయం సాధిస్తుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాడు ఏబీ డివిలియర్స్ అభిమానులకు హామీ ఇచ్చాడు. ఈ మేరకు డివిలియర్స్ హామీ ఇస్తూ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ జట్టు తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘ముంబైతో జరిగే మ్యాచ్లో విజయం కోసం ఆర్సీబీ ఆటగాళ్లు 100 శాతం కృషి చేస్తారని డివిలియర్స్ హామి ఇచ్చిన వీడియోను చూడండి’ అని ట్వీట్లో పేర్కొంది
ఇక ఏబీ ఎం చెప్పాడంటే.. ‘‘కెమెరాకు కుడివైపు నిలబడి ఉన్న గ్యారీ కిర్స్టెన్ ( ఆర్సీబీ హెడ్ కోచ్) నేను ఏం మాట్లాడాలో నాకు చెబుతున్నాడు. మేమంతా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఆర్సీబీ అభిమానులు మాపై ఓ కన్నేసి ఉంచారు. ఈ మ్యాచ్ను మేము గెలవబోతున్నాం.’’ అని తెలిపాడు.
ఇక ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచి రెండు ఓడింది. విధ్వంసకర బ్యాట్స్మన్లు ఉన్నా బెంగళూరును బౌలింగ్ ఇబ్బంది పెడుతోంది. తొలు రెండు మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఉమేశ్ యాదవ్ రాజస్తాన్తో జరిగన మ్యాచ్లో తేలిపోయాడు. ఇక యువస్పిన్నర్ వాషింగ్టన్ సుంధర్, క్రిస్ వోక్స్ పర్వాలేదనిపించిన మెరుగైన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. ఇక డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. ఎలాగైన ఈ మ్యాచ్లో గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లు సైతం ఇప్పటికే మ్యాచ్ కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ జట్ల మధ్య జరిగే రసవత్తర పోరు అభిమానులను కనువిందు చేయనుంది.
You can see the determination in @ABdeVilliers17 eyes. The boys will be putting in their 100% for today's match! #MIvRCB #PlayBold #RCB pic.twitter.com/osux9K1An5
— Royal Challengers (@RCBTweets) 17 April 2018