చెస్ చాంపియన్ దీక్షిత

22 Aug, 2016 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా చెస్ టోర్నమెంట్‌లో దీక్షిత విజేతగా నిలిచింది. కుషాయిగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఆదివారం జరిగిన టోర్నమెంట్‌లో అండర్-17 బాలికల విభాగంలో దీక్షిత (రవీంద్ర భారతి) 5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.

 

బాలుర విభాగంలో జయంత్ (6, డీఏవీ), ప్రతీక్ (5.5, డీఏవీ), రోహిత్ (5, టీవీఆర్ మోడల్)లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండ ర్ -14 బాలికల విభాగంలో నందిత (5) మొదటి స్థానంలో నిలవగా... చేతన (5, సెయింట్ ఆండ్రూస్), మాధురి (4, డీఏవీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

మరిన్ని వార్తలు