హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 156 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7) విఫలం చెందారు. ఆ తర్వాత కొలిన్ మున్రో(40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, శ్రేయస్ అయ్యర్(45; 40 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు.
ఆపై రిషభ్ పంత్(23), అక్షర్ పటేల్(14)లు రెండంకెల స్కోరుకే పరిమితం కావడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్లు తలో వికెట్ తీశారు.