సన్‌రైజర్స్‌ లక్ష్యం 156

14 Apr, 2019 21:51 IST|Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ 156 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా(4), శిఖర్‌ ధావన్‌(7) విఫలం చెందారు. ఆ తర్వాత కొలిన్‌ మున్రో(40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, శ్రేయస్‌ అయ్యర్‌(45; 40 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు.

ఆపై రిషభ్‌ పంత్‌(23), అక్షర్‌ పటేల్‌(14)లు రెండంకెల స్కోరుకే పరిమితం కావడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు