ఢిల్లీలో డేవిస్ కప్ మ్యాచ్

3 Aug, 2016 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పెయిన్‌తో భారత జట్టు తలపడబోయే డేవిస్ కప్ మ్యాచ్‌కు ఢిల్లీ వేదికగా ఎంపికైంది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో భారత్ ఈ మ్యాచ్‌లు ఆడనుంది. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా పోటీలు జరగనున్నాయి.

ఢిల్లీ లాన్ అసోసియేషన్‌కు చెందిన హార్డ్ కోర్టులు మ్యాచ్‌లకు వేదికగా నిలవబోతున్నాయి. గ్రాస్ కోర్టుల్లో మ్యాచ్‌లు జరపాలని ప్రయత్నించామని, వర్షాకాలం కావడంతో హార్డ్ కోర్టులను ఎంపిక చేశామని భారత టెన్నిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భరత్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు