‘ధర్మశాల’ ఆసీస్‌కే అనుకూలం!

23 Mar, 2017 00:56 IST|Sakshi
‘ధర్మశాల’ ఆసీస్‌కే అనుకూలం!

మాజీ పేసర్‌ జాన్సన్‌ వ్యాఖ్య   
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన నాలుగో టెస్టుకు ముందు ఆసీస్‌ మాజీ ఆటగాడు మిషెల్‌ జాన్సన్‌ తన మాటలతో వేడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ధర్మశాల స్టేడియంలోని పిచ్‌ భారత్‌నే ఒత్తిడిలో పడేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆసీస్‌కు అనుకూలించే మైదానమని అతను అన్నాడు. ‘ధర్మశాల స్టేడియం చాలా బాగుం టుంది.

 ఇక్కడి పిచ్‌పై సాధారణంగా పచ్చిక ఎక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఇది ఆస్ట్రేలియాలో ఉండే మైదానంలా కనిపిస్తోంది. దీనిని చూస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే, భారత్‌ మాత్రం ఒత్తిడిలో పడటం ఖాయం. నిజానికి భారత్‌ ఈ సిరీస్‌లో అతి విశ్వాసంతో ఆడింది. 1–1తో ప్రస్తుతం సమంగా ఉండటమే అందుకు నిదర్శనం’ అని జాన్సన్‌ అభిప్రాయ పడ్డాడు.

మరిన్ని వార్తలు