ఐదో వన్డేకు ధోని ఫిట్‌..

2 Feb, 2019 16:39 IST|Sakshi

వెల్లింగ్టన్‌: భుజం గాయం కారణంగా న్యూజిలాండ్‌తో గత రెండు వన్డేలకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ఆఖరి వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. అతను గాయం నుంచి తేరుకుని మ్యాచ్‌లో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నట్లు అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ తెలిపాడు. ఆదివారం భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య చివరిదైన ఐదో వన్డే జరుగనుంది. వెల్లింగ్టన్‌ వేదికగా ఉదయం గం. 7.30 ని.లకు(భారత కాలమాన ప్రకారం) మ్యాచ్‌ ఆరంభం కానుంది.

తొలి మూడు వన్డేల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా... నాల్గో వన్డేలో ఘోర ఓటమి చవిచూసింది. దాంతో ఐదో వన్డేలో గెలిచి టీ20 సిరీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని టీమిండియా భావిస్తోంది. మరొకవైపు కివీస్‌ కూడా టీమిండియా ఆధిక్యాన్ని తగ్గించాలనే యోచనలో ఉంది.+

మరిన్ని వార్తలు