పారా రెజిమెంట్‌లో ధోని శిక్షణ

8 Aug, 2015 00:07 IST|Sakshi
పారా రెజిమెంట్‌లో ధోని శిక్షణ

న్యూఢిల్లీ: భారత సైన్యంలో లె ఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకులో ఉన్న వన్డే జట్టు కెప్టెన్ ధోని ఎలైట్ పారా రెజిమెంట్‌తో కలిసి రెండు వారాల పాటు ప్రాథమిక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ శిక్షణ కోసం ఈనెల 5న ధోని ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ఈ కోర్సు పూర్తి కాగానే తను ఐదు సార్లు పారాచూట్ జంప్ చేసే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. 2011లో ధోని తొలిసారిగా ఆర్మీ కమాండర్‌గా చేరగా పారాచూట్ రెజిమెంట్‌లో తనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదానిచ్చారు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పూర్తి స్థాయిలో ఆర్మీలో సేవలందిస్తానని ధోని గతంలోనే చెప్పాడు.

మరిన్ని వార్తలు