29న ధ్యాన్‌చంద్ స్మారక హాకీ టోర్నమెంట్

25 Aug, 2016 10:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29న ధ్యాన్‌చంద్ స్మారక హాకీ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ రెడ్‌హిల్స్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసక్తి గల జట్లు 27వ తేదీలోగా ఎంట్రీలు నమోదు చేసుకోవాలి.  వివరాలకు హాకీ కోచ్ కె. మనోరంజన్ (9866428052)ను సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు