ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప

21 Aug, 2016 01:04 IST|Sakshi
ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప

న్యూఢిల్లీ: ‘వాల్ట్ ఆఫ్ డెత్’గా పిలిచే ప్రొడునోవా విన్యాసాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని దీపా కర్మాకర్ స్పష్టం చేసింది. రియోలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప శనివారం కోచ్ విశ్వేశ్వర్ నందితో కలిసి భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ‘ఒలింపిక్ పతకం కోసం గట్టిగా కృషిచేశా.

కానీ ఈసారి సాధించలేకపోయాను. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకం గెలుస్తాను. ప్రొడునోవా విన్యాసాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తా. అందరు అనుకుంటున్నట్లు అది డెత్‌వాల్ట్ విన్యాసం కాదు. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ప్రొడునోవా చేయడం కష్టమేం కాదు’ అని దీపా పేర్కొంది.

 

మరిన్ని వార్తలు