షెడ్యూల్‌పై అసంతృప్తి వెనుక...

12 Jul, 2013 04:57 IST|Sakshi

 జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరిగే క్రికెట్ సిరీస్‌పై బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అసంతృప్తి వెనుక మరో కారణం వినిపిస్తోంది. క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈఓ పదవి కోసం హరూన్ లోర్గాట్ పోటీపడుతుండడమే దీనికి కారణమని సమాచారం. గతంలో ఐసీసీ సీఈఓగా మంచి పరిపాలనా అనుభవం కలిగి ఉండడంతో ఆయన ఈ పోస్టుకు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
 
 అయితే లోర్గాట్‌ను దక్షిణాఫ్రికా బోర్డు సీఈఓగా నియమిస్తే తమ జట్టు పర్యటనను రద్దు చేసుకుంటామని బీసీసీఐ హెచ్చరిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఐసీసీ పదవిలో ఉన్నప్పుడు లోర్గాట్‌తో భారత క్రికెట్ బోర్డుకు అంతగా సత్సంబంధాలు లేవు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు బీసీసీఐ అధికారులు సుముఖంగా లేరు. అలాగే ఏడు వన్డేల సిరీస్‌ను తమతో సంప్రదించకుండానే సీఎస్‌ఏ ప్రకటించడంపై కూడా బీసీసీఐ గుర్రుగా ఉంది.
 

మరిన్ని వార్తలు