న్యూపోర్ట్ (అమెరికా): భారత యువ ఆటగాడు దివిజ్ శరణ్ ఏటీపీ టూర్ టెన్నిస్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేశాడు. హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ చాంపియన్షిప్లో ఇవో కార్లొవిచ్ (క్రొయేషియా)తో కలిసి డబుల్స్ బరిలోకి దిగిన దివిజ్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు.
తొలి రౌండ్లో దివిజ్ జోడి 4-6, 7-6 (7/1), 11-9తో ఇల్యా మార్చెంకో- డెనిస్ మాల్చనోవ్ (ఉక్రెయిన్) జంటపై చెమటోడ్చి నెగ్గింది. భారత్-క్రొయేషియా ద్వయం క్వార్టర్ ఫైనల్లో అదిల్ షమస్డిన్ (కెనడా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడితో తలపడుతుంది. సింగిల్స్ రెండో రౌండ్లో ప్రకాశ్ అమృత్రాజ్ నిష్ర్కమించాడు. ప్రపంచ మాజీ నంబర్వన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 6-2, 6-1తో ప్రకాశ్పై అలవోక విజయం సాధించాడు.