జొకోవిచ్ అగ్రస్థానం పదిలం

11 Apr, 2016 19:44 IST|Sakshi
జొకోవిచ్ అగ్రస్థానం పదిలం

మాడ్రిడ్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్లో జొకోవిచ్(16,540 పాయింట్లు) నంబర్ వన్ ర్యాంకును పదిలంగా ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా, బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే (7,815) రెండో స్థానంలోనే కొనసాగుతుండగా, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(7,695) మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత స్థానాల్లో వరుసగా వావ్రింకా, రఫెల్ నాదల్,నిషా కోరీ, బెర్డిచ్, డేవిడ్ ఫెర్రర్, సోంగాలు ఉన్నారు.

 

ఇదిలా ఉండగా,  పురుషుల డబుల్స్ వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో భారత్ కు చెందిన లియాండర్ పేస్ ఒక స్థానం దిగజారి 57వ స్థానంలో నిలవగా, మరో ఆటగాడు రోహన్ బోపన్న 11వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకోగా, రద్వాన్ స్కా రెండో స్థానంలో నిలిచింది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం నంబర్ స్థానాన్ని నిలబెట్టుకుంది.

మరిన్ని వార్తలు