హంపి, హారిక ఓటమి 

10 Jul, 2020 02:39 IST|Sakshi

చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ గ్రాండ్‌ప్రి మూడో అంచె పోటీల్లో భారత పోరాటం ముగిసింది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్‌ ఫైనల్లో ఓటమిపాలయ్యారు. వరల్డ్‌ నంబర్‌ 2 హంపి 2–9తో అలెగ్జాండ్రా కోస్టెనిక్‌ (రష్యా) చేతిలో చిత్తు కాగా, వరల్డ్‌ నంబర్‌వన్‌ హూ యిఫాన్‌ (చైనా) 7–3తో హారికపై విజయం సాధించింది. ఈ టోర్నీలో చివరిదైన నాలుగో అంచె పోటీలు బుధవారంనుంచి జరుగుతాయి. ఇందు లో హంపి, హారిక పాల్గొంటారు. 

>
మరిన్ని వార్తలు