‘ఇక ఫించ్‌ను తప్పించండి’

1 Jan, 2019 13:00 IST|Sakshi

మెల్‌బోర్న్‌: టీమిండియాతో జరుగనున్న నాల్గో టెస్టుకు అరోన్‌ ఫించ్‌ను పక్కన పెట్టాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్‌లో ఫించ్‌కు ఓపెనర్‌గా చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో అతను విఫలమయ్యాడన్నాడు. దాంతో చివరిదైన నాల్గో టెస్టుకు ఫించ్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని సూచించాడు. ఫించ్‌ స్థానంలో అన్‌క్యాప్‌డ్‌ ఆల్‌ రౌండర్‌ మార్నస్‌ లబూఛేగ్నీని జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి మార్నస్‌ను ఓపెనింగ్‌కు పంపి ప్రయోగం చేయాలన్నాడు.

న్యూ ఇయర్‌ టెస్టును ఆసీస్‌ కొత్తగా ఆరంభిస్తే బాగుంటుదని పాంటింగ్‌ పేర్కొన్నాడు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌కు కాస్త భిన్నంగా సన్నద్ధమవ్వాలన్నాడు. ఇప్పటివరకూ జరిగిన సిరీస్‌లో ఫించ్‌ 16 సగటుతో 97 పరుగులు మాత్రమే చేశాడు.

మరిన్ని వార్తలు