డుప్లెసిస్ అజేయ సెంచరీ

29 Aug, 2016 00:44 IST|Sakshi

దక్షిణాఫ్రికా 481/8 డిక్లేర్డ్
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు

సెంచూరియన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డు ప్లెసిస్ (234 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 481/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 283/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు భారీ స్కోరుకు డుమినీ (88), డు ప్లెసిస్ బాటలు వేశారు.


లోయర్ ఆర్డర్‌లో వాన్ జిల్ 35 పరుగులు చేశాడు. వాగ్నెర్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. గప్టిల్ (8), లాథమ్ (4), టేలర్ (1) నిరాశపరిచారు. విలియమ్సన్ (15 బ్యాటింగ్), నికోల్స్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

 

మరిన్ని వార్తలు