బీసీసీఐ, ఐపీఎల్ లకు ఈడీ షోకాజ్ నోటీసు

16 Feb, 2015 13:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పెద్దలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్ సందర్భంగా మీడియా హక్కుల ఒప్పందం విషయంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. 425 కోట్ల రూపాయల మేర  విదేశీ మారకద్రవ్యాల మొత్తానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ షోకాజ్ నోటీసు పంపింది.

మరిన్ని వార్తలు