తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు స్వల్ప ఆధిక్యం

19 Jul, 2014 17:44 IST|Sakshi

లండన్:భారత్ తో లార్డ్స్ లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్  319 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దీంతో ఇంగ్లండ్ కు 24 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు  బ్యాలెన్స్ (110) సెంచరీ చేసి ఇంగ్లండ్ ను క్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడాడు.

 

ఇంగ్లండ్ చివరి వరుస ఆటగాళ్లలో ప్రయర్ (23),బ్రాడ్ (4), అండర్ సన్ (19) పరుగులు చేసి ఇంగ్లండ్ ను ఆధిక్యంలో నిలిపారు.భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కు ఆరు వికెట్లు లభించగా, జడేజాకు రెండు,మహ్మద్ సమీ, మురళీ విజయ్ లకు తలో వికెట్టు లభించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో వికెట్టు నష్టపోకుండా 11 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు