ఇంగ్లండ్, శ్రీలంక మూడో టెస్టు ‘డ్రా’

14 Jun, 2016 00:21 IST|Sakshi

లార్డ్స్: భారీ వర్షం కారణంగా చివరి రోజు 12.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడంతో.... ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. 32/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. కరుణరత్నే (37 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో సొంతం చేసుకుంది. గురు, శనివారాల్లో ఐర్లాండ్‌తో రెండు వన్డేల్లో తలపడే శ్రీలంక... అనంతరం ఇంగ్లండ్‌తో 21న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది.

మరిన్ని వార్తలు