నేడు ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్
ముంబై: మహిళల ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు తలపడ్డ ఈ టోర్నీలో హర్మన్ప్రీత్ బృందం ఇప్పటికే ఇంటిముఖం పట్టగా శనివారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తుదిపోరు జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు రెండు సార్లు తలపడగా... చెరోసారి విజయం సాధించాయి. ఇంగ్లండ్కు వ్యాట్, స్కీవర్, బ్యూమౌంట్, హీతర్ నైట్ ముఖ్యమైన ఆటగాళ్లు. ఆస్ట్రేలియాకు మూనీ, హేలీ, విలానీ, మెగ్ లానింగ్, పెర్రీ, షుట్ కీలకం.