నాలుగో బంతికే కోహ్లీ రనౌట్‌

1 Feb, 2017 19:48 IST|Sakshi
నాలుగో బంతికే కోహ్లీ రనౌట్‌

బెంగళూరు: టీమిండియాతో చివరి, మూడో టి-20లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. లోకేష్‌ రాహుల్తో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కాగా కోహ్లీ ఆడిన నాలుగో బంతికే రనౌటయ్యాడు. రాహుల్, రైనా బ్యాటింగ్ చేస్తున్నారు.

టీమిండియా తరఫున రిషబ్ పంత్‌ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల రిషబ్ కీపర్ కమ్ బ్యాట్స్మన్. మూడు టి-20ల సిరీస్లో భారత్, ఇంగ్లండ్‌ చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే.

జట్లు:

భారత్‌: రిషబ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్), యువరాజ్, ధోనీ (కీపర్), పాండ్య, అమిత్ మిశ్రా, బుమ్రా, నెహ్రా, చహల్

ఇంగ్లండ్‌: జేసన్ రాయ్, బిల్లింగ్స్, రూట్, మోర్గాన్ (కెప్టెన్), స్టోక్స్, బట్లర్ (కీపర్), మొయిన్ అలీ, జోర్డాన్, ప్లంకెట్, మిల్స్, రషీద్‌

మరిన్ని వార్తలు