-

ఉమేష్‌ అవుట్‌, భువి ఇన్‌

19 Jan, 2017 13:50 IST|Sakshi
ఉమేష్‌ అవుట్‌, భువి ఇన్‌

కటక్: టీమిండియాతో కీలక రెండో వన్డేలో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్‌ కటక్ బారాబతి స్టేడియంలో జరుగుతోంది. తొలి మ్యాచ్లో నెగ్గిన టీమిండియా సిరీస్లో 1-0తో ముందున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్‌ భారత్‌ సొంతమవుతుంది.

టీమిండియాలో కేవలం ఓ మార్పు చేశారు. పేసర్‌ ఉమేష్‌ యాదవ్ స్థానంలో భువనేశ్వర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్‌ జట్టులో కూడా ఒకే మార్పు జరిగింది. రషీద్‌ స్థానంలో ప్లంకెట్‌ జట్టులోకి వచ్చాడు.

జట్లు:

భారత్‌: రాహుల్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్), యువరాజ్‌, ధోనీ (కీపర్), జాదవ్‌, పాండ్య, జడేజా, అశ్విన్‌, బుమ్రా, భువనేశ్వర్‌
ఇంగ్లండ్‌: రాయ్‌, హేల్స్, రూట్‌, మోర్గాన్‌ (కెప్టెన్), బట్లర్ (కీపర్)‌, స్టోక్స్, అలీ, ప్లంకెట్, వోక్స్, విల్లీ, బాల్‌