సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పాటతో అదరగొట్టాడు. ఈ పాటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. నిలకడలేమి ప్రదర్శనతో రైనా కొద్ది కాలం జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టులోకి వచ్చి అదరగొట్టిన రైనా.. ప్రస్తుతం నిదహాస్ పర్యటనలో భాగంగా శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. అయితే రైనా బస చేస్తున్నహోటల్లో మ్యూజిక్ ప్రొగ్రామ్ జరుగుతోంది. సహచర ఆటగాళ్లతో రైనా అక్కడికి చేరుకున్నాడు.
సింగర్స్ .. ‘యే షామ్ మస్తానీ... మదోష్ కియ జాయ్’ అనే పాటను ఆలపిస్తున్నారు. ఈ పాట విన్న రైనా వెంటనే వారితో గొంతు కలిపాడు. ఈ వీడియోను ‘రైనాను కేవలం మైదానంలోనే చూసుంటారు. కానీ పాటపడటం ఇప్పటి వరకు చూసుండరు.’ అనే క్యాప్షన్తో బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ పాట గ్రేట్ సింగర్ కిషోర్ కుమార్ పాడిన కటీ పతంగ్ సినిమాలోనిది.