పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి

23 Dec, 2015 01:30 IST|Sakshi
పాక్‌తో పూర్తిస్థాయి సిరీస్ జరగాలి

భారత్, పాకిస్తాన్‌ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరగాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ సిరీస్ జరగాలనే నేను కోరుకుంటాను. అయితే నిర్ణయం తీసుకోవడంలో అనేక ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది’ అని గంగూలీ అన్నారు. ఆటకు వయసుతో సంబంధం లేదని యువరాజ్, నెహ్రాలు జట్టులోకి రావడం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.
 

మరిన్ని వార్తలు