మనోళ్లు ఐదుగురు

5 Feb, 2018 04:54 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటుదక్కింది. కెప్టెన్‌ పృథ్వీ షాతో పాటు మన్‌జోత్‌ కల్రా, శుభ్‌మన్‌ గిల్, కమలేశ్‌ నాగర్‌కోటి, అనుకూల్‌ రాయ్‌లు ఈ టీమ్‌లో ఉన్నారు. మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకే బెర్తు దక్కగా... నాలుగోసారి చాంపియన్‌ అయిన భారత ఆటగాళ్లే ఐదుగురు ఉండటం విశేషం.  

ఐసీసీ జట్టు: రేనార్డ్‌ వాన్‌ (కెప్టెన్, దక్షిణాఫ్రికా), పృథ్వీ షా, మన్‌జోత్‌ కల్రా, శుభ్‌మన్‌ గిల్, నాగర్‌కోటి, అనుకుల్‌ రాయ్‌ (భారత్‌), ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌),  మక్వెటు (వికెట్‌ కీపర్‌), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), కైయిస్‌ అహ్మద్‌ (అఫ్గానిస్తాన్‌), షహీన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌), 12వ ఆటగాడుగా అలిక్‌ అథనాజ్‌ (వెస్టిండీస్‌).

మరిన్ని వార్తలు