భారత్‌కు ఐదు పతకాలు

12 Jun, 2015 01:06 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్‌కు మొత్తం 5 పతకాలు దక్కాయి. 85 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అరుణ్ కుమార్, 50 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ప్రదీప్ స్వర్ణాలు గెలుచుకున్నారు. అరుణ్ 7-6తో హషిమిజుబర్ (ఇరాన్)పై విజయం సాధించగా, ప్రదీప్ 6-0తో సన్‌షిరో (జపాన్)ను చిత్తు చేశాడు. 100 కేజీల ఫ్రీస్టైల్‌లో నాసిర్ హుస్సేన్‌కు రజతం దక్కింది. మహిళల 40 కేజీల ఫ్రీ స్టైల్‌లో అన్నూదేవి రజత పతకం, 35 కేజీల ఫ్రీస్టైల్‌లో అంకుశ్ కాంస్యం గెలుచుకున్నారు.

>
మరిన్ని వార్తలు