హరికృష్ణ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

24 Apr, 2019 01:19 IST|Sakshi

షెన్‌జెన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 43 ఎత్తుల్లో దిమిత్రీ జకొవెంకో (రష్యా)పై గెలుపొందాడు.

ఆరుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) రెండో స్థానంలో... మూడు పాయింట్లతో లిరెన్‌ డింగ్‌ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు.    

మరిన్ని వార్తలు