ఫుట్బాల్ ప్రపంచ కప్ను గెలుచుకొని స్వదేశంలోకి అడుగు పెట్టిన ఫ్రాన్స్ జట్టుకు అపూర్వ రీతిలో ఘన స్వాగతం లభించింది. పారిస్లో జరిగిన విక్టరీ పరేడ్లో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడి తమ హీరోలకు జేజేలు పలికారు. ఓపెన్ టాప్ బస్సులో జట్టు సభ్యులంతా ట్రోఫీని ప్రదర్శిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం దేశాధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చిన ప్రత్యేక విందుకు ఆటగాళ్లు హాజరయ్యారు. వారిని అత్యున్నత పౌర పురస్కారం ‘లెజియన్ ఆఫ్ ఆనర్’తో త్వరలో సత్కరిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు.