ఫ్రెండ్లీ మ్యాచ్‌ రద్దు 

15 Mar, 2020 03:43 IST|Sakshi

బెర్లిన్‌: జర్మనీ, ఇటలీ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య ఈ నెల 31న జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ రద్దయింది. ఈ మ్యాచ్‌ బవేరియా ప్రాంతం (జర్మనీలో)లోని న్యూరెమ్‌బర్గ్‌లో జరగాల్సి ఉండగా... ప్రస్తుతం అక్కడ కరోనా ఉధృతి అధికంగా ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో 100 మందికి మించి జనం గుమికూడదని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలుత ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను జరపాలని అనుకున్నా... జట్టు సభ్యులు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సెక్యూరిటీతో స్టేడియంలోని జనం సంఖ్య 100 మందికిపైగా చేరుకుంటుండటంతో రద్దు చేయడానికే జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య నిర్ణయించుకుంది. 

>
మరిన్ని వార్తలు