మూడో రోజు నుంచి ‘స్పిన్’

12 Dec, 2016 14:50 IST|Sakshi
మూడో రోజు నుంచి ‘స్పిన్’

ముంబై వాంఖడే మైదానం సిద్ధం  
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు నాలుగో టెస్టుతోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో గత రెండు టెస్టులలాగే ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలంగా సిద్ధమవుతోంది. ఈ పిచ్‌పై మూడో రోజు ఉదయం నుంచి బంతి తిరగవచ్చని భావిస్తున్నారు. గురువారం నుంచి టెస్టు ప్రారంభం కానుండగా, ఇప్పటికే పిచ్‌పై ఉన్న పచ్చికను కత్తిరించి, నీళ్లు చిలకరించడం కూడా తగ్గించేశారు. ఈ విషయాన్ని పిచ్ క్యురేటర్ మమున్‌కర్ ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ వేదిక బౌలింగ్‌కు అనుకూలించలేదు. అరుుతే కొత్తగా మార్పులు చేర్పులు చేసిన తర్వాత వాంఖడే వికెట్ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు కలిసొచ్చింది. గతంలో మురళీ కార్తీక్, ఓజా, పనేసర్ ఇక్కడ అద్భుత గణాంకాలు నమోదు చేశారు.  
 

మరిన్ని వార్తలు