గంభీర్‌.. చిన్న పిల్లాడిలా!

15 Nov, 2018 21:48 IST|Sakshi

తనపై సెటైర్‌ వేసుకున్న గంభీర్‌

సాక్షి, న్యూ ఢిల్లీ: సోషల్‌ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిల్డ్రన్స్‌ డే స్పెషల్‌ సందర్భంగా అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా సారథి గంభీర్‌ నిర్లక్ష్యంగా రనౌట్‌ అవుతాడు.

దీనిపై ట్విటర్‌ వేదికగా గంభీర్‌ ఫన్నీగా స్పందించాడు. గంభీర్‌ చేసిన ట్వీట్‌లో ఇద్దరు కూతుళ్లు మాట్లాడుకుంటూ.. ‘అక్కా పప్పా చిల్డ్రన్స్‌ డే ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నాడు అని అనైజా(గంభీర్‌ చిన్న కూతురు) అడిగితే.. అజీన్‌ (పెద్ద కూతురు) సమాధానమిస్తూ రంజీ ట్రోఫీ సందర్భంగా చిన్న పిల్లాడిలా అవుటయ్యి సెలబ్రేట్‌ చేసుకున్నాడు’ అంటూ గంభీర్‌ తనపై సెటైర్‌ వేసుకున్నాడు. ప్రస్తుతం గంభీర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో గంభీర్‌ దుర్భాషలాడుతూ మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు