న్యూఢిల్లీ: ‘దంగల్’ హంగామా మొదలైంది. ప్రొ రెజ్లింగ్ లీగ్ సీజన్–2లో హరియాణా హ్యామర్స్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో హరియాణా 4–3 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై మహారథిని ఓడించింది.
హరియాణా తరఫున రజనీశ్ (65 కేజీలు) 7–2తో వికాస్పై, గడిసోవ్ (97 కేజీలు) 6–0తో పావ్లో ఒలినిక్పై, సోఫియా మాట్సన్ (53 కేజీలు) 4–2తో లలితా షెరావత్పై, మర్వా అమ్రి (58 కేజీలు) 5–0తో సరితపై గెలుపొందారు. ముంబై తరఫున ఎరికా వీబ్ (75 కేజీలు), హసనోవ్ (74 కేజీలు), రాహుల్ అవారె (57 కేజీల) 14–5తో సందీప్ తోమర్పై నెగ్గారు. మంగళవారం జరిగే పోటీలో పంజాబ్తో జైపూర్ తలపడుతుంది.