నిప్పులు చెరిగిన వినోద్

9 Dec, 2013 01:58 IST|Sakshi
నిప్పులు చెరిగిన వినోద్

సాక్షి, హైదరాబాద్: గోల్కొండ జట్టు బౌలర్ వినోద్ (6/40) నిప్పులు చెరగడంతో రంగారెడ్డి జిల్లా జట్టు పరాజయం చవిచూసింది. ఎ12-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గోల్కొండ జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. మొదట రంగారెడ్డి జట్టు 135 పరుగులకే ఆలౌటైంది. కిరిటీ 33, అఖిలేశ్ 26 పరుగులు చేశారు. గోల్కొండ బౌలర్ హరికుమార్ 4 వికెట్లు తీశాడు. తర్వాత గోల్కొండ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయిరాజ్ (67) అర్ధసెంచరీ సాధించగా, రంగారెడ్డి బౌలర్ నిర్భయ్ 3 వికెట్లు పడగొట్టాడు.
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
  అక్షిత్ సీసీ: 134 (శ్రీకల్ 30; సలీమ్ ఆరిఫ్ 5/20), సీకే ఆక్రిలిక్: 135/3 (ఆరిఫ్ 54).
  నోబుల్ సీసీ: 194/9 (అనదీప్ 37, ప్రణమ్ 31; కపిల్ వ్యాస్ 5/46, నైరుత్ 2/27), డబ్ల్యూఎంసీసీ: 195/4 (నినాంత్ రెడ్డి 100).
  ఎంపీ బ్లూస్: 305/5 (రాజు 111, వరుణ్ 100, సతీశ్ 45), నవజీవన్ ఫ్రెండ్స్: 89 (సతీశ్ 5/23, హరినారాయణ 3/5)
  ఎలెవన్ మాస్టర్స్: 175 ( అమిత్ 3/51, ప్రవీణ్ 4/41), సూపర్ స్టార్: 176/7.

>
మరిన్ని వార్తలు