గంగూలీ ఎంపికపై లక్ష్మణ్
కోల్కతా : బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా సౌరవ్గంగూలీ నియామకం క్రికెట్ క్రీడకు శుభసూచకమని మాజీ టెస్టు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ‘బెంగాల్ క్రికెట్ ఇప్పుడు గంగూలీ చేతుల్లో ఉంది. గత ఏడాది కాలంగా ఆయన్ని క్రీడా పరిపాలకుడిగా చూస్తున్నాను. ఇదో అద్భుత ఎంపిక. భారత క్రికెట్కు శుభసూచకం. తమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తారు’ అని బెంగాల్ రంజీ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్న లక్ష్మణ్ తెలిపారు.