మొహాలి:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ సోమవారం కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సురేష్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా కనిపిస్తుండగా, డేవిడ్ మిల్లర్ నేతృత్వంలో కింగ్స్ పంజాబ్ జట్టు కాస్త బలహీనంగానే కనబడుతోంది.ఇరు జట్లు బ్యాటింగ్ పైనే ప్రధానంగా ఆధారపడే అవకాశం ఉంది.