వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం

5 Apr, 2018 07:49 IST|Sakshi
వెయిట్‌లిఫ్టర్‌ గురురాజా

సాక్షి, హైదరాబాద్‌ : కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో గురురాజాకు ఇదే తొలి పతకం.

261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్‌ లిప్టర్‌ మహ్మద్‌ ఇజార్‌ అహ్మద్‌ పసిడి సాధించగా, శ్రీలంక లిఫ్టర్‌ లక్మల్‌ 248 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

మరిన్ని వార్తలు