విహారి అజేయ సెంచరీ

11 Aug, 2018 01:25 IST|Sakshi

బెంగళూరు: ఆంధ్ర రంజీ క్రికెటర్‌ గాదె హనుమ విహారి (138 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

విహారితో పాటు అంకిత్‌ బావ్నే (80; 10 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విహారితో పాటు మరో అంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌ (30 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు