'మ్యాచ్ ను రక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది'

14 Jul, 2014 18:10 IST|Sakshi

నాటింగ్ హమ్:భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలిటెస్టు మ్యాచ్ ప్రతర్థి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని భారత్ ఆటగాడు స్టువర్డ్ బిన్నీ తెలిపాడు. ఆ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బిన్నీ(78) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు  జట్టుకు ఉపయోగపడినందుకు సంతోషంగా ఉందన్నాడు.' నేను ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా నిరాశ చెందాను. క్రీజ్ లో పది-పది హేను నిమిషాలు కష్టపడ్డా.. ఒక చెత్త షాట్ కొంపముంచిందని' బిన్నీ తెలిపాడు.

 

సెకెండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండాలనుకున్నానని, ఆ సానుకూల థృక్పధంతోనే క్రీజ్ లో కి అడుగుపెట్టానని తెలిపాడు. అందరికీ జట్టు క్లిష్ట పరిస్థితుల్నినుంచి కాపాడే అవకాశం రాదని.. కానీ అటువంటి అవకాశం తనకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు.

మరిన్ని వార్తలు